తెలంగాణలో కరోనా కేసులు పెరుగుతున్న కారణంగా ప్రభుత్వం నైట్ కర్ఫ్యూ విధించిన విషయం తెలిసిందే. అయితే ఇవాళ రాత్రి 9 గంటల నుంచే తెలంగాణలో కర్ఫ్యూ అమల్లోకి రానున్న నేపథ్యంలో.. హైదరాబాద్ మెట్రో రైలు తన సర్వీసుల్లో స్వల్ప మార్పులు చేసింది. చివరి స్టేషన్ నుంచి రాత్రి 7.45 గంటల వరకే చివరి మెట్రో రైలు అందుబాటులో ఉంటుందని.. రాత్రి 8:45 గంటలకు చివరి స్టేషన్కు మెట్రో రైలు చేరుకుంటుందని స్పష్టం చేసింది.. ఈ నెల 30వ తేదీ వరకు మార్చిన సమయాల్లోనే సర్వీసులు నడుస్తాయని పేర్కొంది.. అయితే, ఉదయం పూట మెట్రో సర్వీసులకు ఎలాంటి అవతరాలు లేవు.. ఉదయం 5 గంటలకే కర్ఫ్యూ ముగియనున్న నేపథ్యంలో.. ఉదయం 6:30 గంటల నుంచి మొదటి రైలు యథావిధిగా అందుబాటులో ఉంటుందని మెట్రో ప్రకటించింది.. ఇక, కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తోన్న సమయంలో.. ప్రయాణికులు తప్పనిసరిగా మాస్కులు, శానిటైజర్లు వాడాలని సూచించింది హైదరాబాద్ మెట్రో రైలు.
previous post
సేవామిత్ర డేటా దొంగిలించి వైసీపీకి ఇచ్చారు: చంద్రబాబు