జనసేన అధినేత ని పవన్కల్యాణ్ పవన్ విలీన ప్రతిపాదనతో వస్తే ఆహ్వానిస్తామని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహరావు అన్నారు. బీజేపీకి తాను దూరంగా లేనని.. కలిసే ఉన్నానని పవన్ వ్యాఖ్యలను ఆయన స్వాగతించారు. బీజేపీతో కలిసే ఉన్నామని.. కేంద్రం పెద్దలంటే తమకు గౌరవమని, పవన్, టీడీపీ నేతలు చెబుతున్నారని తెలిపారు. తమ విధానాలు నచ్చి బీజేపీతో కలిసి పనిచేయాలనుకుంటేఅందుకు తన వంతు సహకారం అందిస్తామని భరోసా ఇచ్చారు.
ఎన్నికల ముందే జనసేనని బీజేపీలో విలీనం చేయాలని కోరామని, అప్పుడు పవన్ అంగీకరించలేదని ఈ సందర్భంగా గుర్తుచేశారు. పొత్తులకు ఇది సమయం కాదన్నారు. మతసామరస్యం లేకపోవడానికి హిందువులే కారణమన్న పవన్ వ్యాఖ్యలను జీవీఎల్ ఖండించారు. మత ఘర్షణలకు హిందువులే కారణమనడం రాజకీయ దురుద్దేశమేనని పేర్కొన్నారు.
చంద్రబాబు ఇంకా తానే సీఎం అనే అపోహలో ఉన్నారు: హోం మంత్రి సుచరిత