telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

తెలంగాణలో కరోనా విలయం : రాములమ్మ సంచలన వ్యాఖ్యలు

vijayashanti congress

తెలంగాణలో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. రోజు రోజుకు రికార్డు స్థాయిలో కేసులు పెరుగుతూనే ఉన్నాయి. రాష్ట్రంలో కరోనా కేసులు 3 లక్షలు దాటేశాయి.  కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో బీజేపీ నేత విజయశాంతి కెసిఆర్ ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు. తెలంగాణ ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లనే కేసులు పెరుగుతున్నాయని మండిపడ్డారు. “తెలంగాణలో కోవిడ్ వ్యాప్తికి ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరే సగం కారణమని స్పష్టమవుతోంది. గత మూడు నాలుగు రోజుల్లో మీడియా ద్వారా వెల్లడైన పరిశోధనాత్మక నివేదికల్ని పరిశీలిస్తే కరోనా కేసుల విషయంలో సర్కారు ఎంత గుట్టుగా వ్యవహరిస్తోందో తెలుస్తుంది. ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాలు, ప్రయివేటు ల్యాబ్స్‌లో చేస్తున్న పరీక్షలు… బులిటెన్ ద్వారా ప్రకటిస్తున్న ఫలితాలు… వాస్తవ గణాంకాలకు ఏ మాత్రం పొంతన లేదని ఆ నివేదికలు ఆధారాలతో సహా విశ్లేషించాయి. కరోనా పాజిటివ్ కేసులకు సంబంధించి ప్రభుత్వ వర్గాల అంకెలు వందల్లో ఉంటే… వాస్తవ పరిశోధన ప్రకారం ఈ కేసులు వేలల్లో కనిపిస్తున్నాయి. గతేడాది ప్రభుత్వ వెబ్ సైట్‌లో కరోనా కేసుల గణాంకాలను కొన్నాళ్ళు అప్‌డేట్ చెయ్యకుండా ఆపేస్తే హైకోర్టు మందలింపుల తర్వాత మళ్ళీ కొనసాగించారు. ఈ వ్యవహారం ఉద్దేశ్యపూర్వకంగానే జరుగుతున్నట్టు అప్పట్లో హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఇదంతా ఒక కోణమైతే… పరీక్షలు జరుగుతున్న ప్రాంతాల్లో నెలకొని ఉన్న పరిస్థితులు నరకానికి నకళ్ళుగా ఉన్నాయి. కరోనా అనుమానితులు, అరోగ్యంగా ఉన్నవారు… రకరకాల వ్యాధిగ్రస్తులు… అందరినీ గుంపులుగా గంటల తరబడి భౌతిక దూరం, సానిటైజేషన్, ఇతర జాగ్రత్తలేవీ లేకుండా ఒకేచోట నిలబెట్టి టెస్టులు చేస్తున్నారు. ఇదెంత ప్రమాదకరమో పాలకులకు తెలియదా? ప్రజారోగ్యాన్ని పక్కనపడేసి, జనజీవనాన్ని అస్తవ్యస్తం చేస్తున్న ఈ పాలకుల పట్టింపులేనితనమే వారి పతనానికి నాంది.” విజయశాంతి ఫైర్ అయ్యారు. 

Related posts