ప్రముఖ తమిళ హీరో విక్రమ్ కు తెలుగులోనూ మంచి ఫాలోయింగ్ ఉంది. ప్రస్తుతం విక్రమ్.. అజయ్ ఙ్ఞానముత్తు దర్శకత్వంలో “కోబ్రా” అనే చిత్రం చేస్తున్నారు. ఆ తరువాత కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో ఆయన నటించనున్నారు. సెవెన్ స్క్రీన్ స్టూడియోస్ పతాకంపై లలిత్ కుమార్ నిర్మిస్తోన్న ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతం అందించబోతున్నారు. దీనిపై అధికారిక ప్రకటన రానప్పటికీ.. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయట. ఈ సినిమాలో విక్రమ్ సరసన మాస్టర్ బ్యూటీ మాళవిక మోహనన్ కనిపించబోతుందని టాక్ వినిపిస్తుంది. ఇక “పేట” సినిమాతో ఈ బ్యూటీకి ఫ్యాన్ ఫాలోయింగ్ గట్టిగానే పెరిగింది. దాంతో డైరెక్టర్ కార్తీక్ మాళవిక అయితే బాగుంటుందని ఆలోచిస్తున్నట్లు తెలుస్తుంది. ఇక ఈ మూవీలో విక్రమ్ తనయుడు ధృవ్ కూడా నటిస్తుండటం విశేషం. ఇక ప్రస్తుతం తండ్రితో పోటీ పడటానికి ధృవ్ బాడీని పెంచే పనిలో పడ్డాడు. ఇటీవలే జిమ్ లో వర్కౌట్ చేస్తున్న పిక్ షేర్ చేశాడు.
previous post
వాళ్ళను చూసి ఆడవాళ్లు చెడిపోతున్నారు : శ్రీరెడ్డి