ప్రజల వద్ద నుండి సేకరించిన వైరాలతోనే రామమందిర నిర్మాణం చేయాలనీ నిర్ణయించారు. అయితే అందుకు పవన్ తన వంతుగా రూ. 30 లక్షల విరాళం తిరుపతిలో అందజేసిన విషయం తెలిసిందే. ఇప్పుడాయన స్ఫూర్తితో అయిదుగురు టాలీవుడ్ అగ్ర నిర్మాతలు రామ మందిర నిర్మాణానికి భారీ విరాళమందించారు. దిల్ రాజు, బండ్ల గణేష్, ఎ.ఎమ్. రత్నం, ఎస్. రాధా కృష్ణ, నవీన్ ఎర్నేని, కలిసి అయోధ్య రామ మందిర నిర్మాణానికి రూ. 54.51 లక్షల విరాళమందించారు. ఈ మేరకు ఆర్ఎస్ఎస్ తెలంగాణ ప్రాంత ప్రచారక్ దేవేందర్కు పవన్ చేతులు మీదుగా చెక్కులు అందించారు. కార్యక్రమంలో గోల్కొండ బాఘ్ సంఘ్ చాలక్ డాక్టర్ వేదప్రకాశ్, నిర్మాత ఎ దయాకర్రావు పాల్గొన్నారు. ప్రస్తుతం పవన్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. విరాళాలందించిన ఈ ఐదుగురు నిర్మాతలు పవన్ తో కలిసి పనిచేయబోతున్నారు. పవన్-రానా మలయాళం సూపర్ హిట్ సినిమా ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ రీమేక్ లో నటిస్తుండగా.. పవన్-క్రిష్ సినిమా షూటింగ్ కూడా శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమాల తరువాత పవన్, దర్శకుడు హరీష్ శంకర్ తో చేయనున్నాడు. ఇక పవన్ ‘వకీల్ సాబ్’ సినిమా సమ్మర్ కానుకగా ఏప్రిల్ 9న విడుదల కానుంది. చూడాలి మరి ఈ సినిమా ఎలా ఉండనుంచి అనేది.
previous post
ఉద్యోగులకు పాత పద్ధతిలోనే పెన్షన్: పవన్ కల్యాణ్