telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు

ప్రజలను బకరాలు చేసేందుకే కేసీఆర్‌ ఢిల్లీ టూర్‌..

బీజేపీ నాయకురాలు విజయశాంతి మరోసారి సీఎం కేసీఆర్‌ పై ఫైర్‌ అయ్యారు. మోసాల కేసీఆర్‌ను ఢిల్లీలో ఎవరూ నమ్మే పరిస్థితి లేదని విజయశాంతి ఆరోపణలు చేశారు. సీఎం హోదాలో అపాయింట్‌మెంట్‌ తీసుకుని.. ప్రజలకు బకరాలను చేసేందుకు ఈ ప్రయత్నం చేశారని ఆగ్రహించారు. త్వరలో అవినీతి ఆరోపణలు రుజువవుతాయని మండిపడ్డారు. కేసీఆర్‌ ప్రభుత్వం కూలడం ఖాయమని హెచ్చరించారు. ప్రజలు మార్పుకోరుకుంటున్నారని… తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రధాని మోడీ రైతుల సంక్షేమానికి ఎంతోగానో కృషి చేస్తున్నారని కొనియాడారు. కేంద్రం తీసుకువచ్చిన రైతు చట్టాలు రైతులకు ఎంతోగానో మేలు చేస్తాయని తెలిపారు. కాగా.. ఇటీవలే విజయశాంతి కాంగ్రెస్‌ పార్టీని వీడి బీజేపీలో చేరిన విషయం తెలిసిందే.. విజయశాంతి ఢిల్లీకి వెళ్లి.. బీజేపీ కండువా కప్పుకున్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా ఆధ్వర్యంలో పార్టీలో చేరారు విజయశాంతి. విజయశాంతి రాజకీయ ఆరంగ్రేటం కూడా బీజేపీలో కావడం విశేషం.  తిరిగి మళ్లీ ఆమె సొంత గూటికి చేరుకున్నారు.

Related posts