ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయి హయాంలో తాను ప్రతిపాదించిన రైల్వే లైన్లు అందుబాటులోకి రావడం ఎంతో సంతోషంగా ఉందని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు తెలిపారు. కృష్ణపట్నం–ఓబులవారి పల్లె రైల్వే లైన్ ప్రాజెక్టును తాను ప్రతిపాదించానని ఇప్పుడు ఆ ప్రాజెక్టును విజయవంతంగా పూర్తయిందన్నారు.
ఈ లైన్ పూర్తిచేసిన రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్(ఆర్వీఎన్ఎల్), రైల్వే శాఖలకు అభినందనలు చెప్పారు. ఈ మార్గంలో రైల్వేశాఖ డీజిల్ ఇంజిన్ తో ట్రయల్ రన్ నిర్వహించడాన్ని స్వాగతిస్తున్నామని చెప్పారు. ఈ నెల 20 నుంచి ఈ రూట్ లో ఎలక్ట్రిక్ రైలు అందుబాటులోకి వస్తుందని వెల్లడించారు. తాను ప్రతిపాదించిన ప్యాసింజర్ రైలును త్వరితగతిన ఏర్పాటు చేసినందుకు రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్ సంస్థకు మరోసారి వెంకయ్య ధన్యవాదాలు తెలియజేశారు.