telugu navyamedia
రాజకీయ వార్తలు

రైల్వే లైన్ అందుబాటులోకి రావడం ఎంతో ఆనందం: వెంకయ్య

Vice President of India Venkaiah Terrarism

ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయి హయాంలో తాను ప్రతిపాదించిన రైల్వే లైన్లు అందుబాటులోకి రావడం ఎంతో సంతోషంగా ఉందని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు తెలిపారు. కృష్ణపట్నం–ఓబులవారి పల్లె రైల్వే లైన్ ప్రాజెక్టును తాను ప్రతిపాదించానని ఇప్పుడు ఆ ప్రాజెక్టును విజయవంతంగా పూర్తయిందన్నారు.

ఈ లైన్ పూర్తిచేసిన రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్(ఆర్వీఎన్ఎల్), రైల్వే శాఖలకు అభినందనలు చెప్పారు. ఈ మార్గంలో రైల్వేశాఖ డీజిల్ ఇంజిన్ తో ట్రయల్ రన్ నిర్వహించడాన్ని స్వాగతిస్తున్నామని చెప్పారు. ఈ నెల 20 నుంచి ఈ రూట్ లో ఎలక్ట్రిక్ రైలు అందుబాటులోకి వస్తుందని వెల్లడించారు. తాను ప్రతిపాదించిన ప్యాసింజర్ రైలును త్వరితగతిన ఏర్పాటు చేసినందుకు రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్ సంస్థకు మరోసారి వెంకయ్య ధన్యవాదాలు తెలియజేశారు.

Related posts