telugu navyamedia
వార్తలు వ్యాపార వార్తలు సామాజిక

దూసుకుపోతున్న రిలయన్స్ షేర్..!

reliance mukesh ambani

స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ లో రిలయన్స్ ఇండస్ట్రీస్ దూసుకుపోతోంది. తమ రీటైల్ బిజినెస్ లో ప్రైవేట్ ఈక్విటీ సంస్థ సిల్వర్ లేక్ రూ. 7,500 కోట్ల పెట్టుబడులు పెట్టబోతోందని నిన్న రిలయన్స్ ప్రకటించింది.

దీంతో, ఆ సంస్థ షేర్ వాల్యూ ఒక్కసారిగా పెరిగింది. బీఎస్ఈలో నిన్నటి ముగింపు రూ. 2,161తో పోలిస్తే… ప్రస్తుతం రిలయన్స్ షేర్ మరో రూ. 151 పెరిగి రికార్డు స్థాయిలో రూ. 2,313 వద్ద ట్రేడ్ అవుతోంది.

మరోవైపు దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు భారీ లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 533 పాయింట్లు పెరిగి 38,727 వద్ద ట్రేడ్ అవుతోంది. నిఫ్టీ 137 పాయింట్లు లాభపడి 11,417 వద్ద కొనసాగుతోంది. 

Related posts