telugu navyamedia
వార్తలు సినిమా వార్తలు

‘అయ్యయయో’ అంటున్న కార్తికేయ…

ఆర్ఎక్స్ 100 ఫెమ్ హీరో కార్తికేయ, హీరోయిన్‌ లావణ్య త్రిపాఠి జంటగా నటించిన చిత్రం ‘చావు కబురు చల్లగా’. కౌశిక్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో ఆమని, మురళీ శర్మ,  శ్రీకాంత్ అయ్యంగార్, భద్రం, మహేష్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.  బుల్లితెర బ్యూటీ యాంకర్ అనసూయ కీలక పాత్రలో నటిస్తున్నారు. అయితే ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదల అయిన పాటలు, ట్రైలర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. సరికొత్త కాన్సెప్ట్‌తో వస్తున్న ఈ సినిమాలో కార్తికేయ స్వర్గపురి వాహనం డ్రైవర్‌గా, లావణ్య నర్సుగా కనిపిచనున్నారు. ఇప్పటికే విడుదల అయిన పోస్టర్లు, ట్రైలర్, పాటలు సినిమాపై అంచనాలు పెంచగా, తాజాగా ఈ సినిమాకి సంబంధించి ‘అయ్యయయో’ అనే ఫుల్ వీడియో సాంగ్‌ను విడుదల చేశారు. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ సినిమా మార్చి 19న విడుదలకు సిద్దమవుతుంది. అయితే చూడాలి మరి ఈ సినిమా అభిమానుల అంచనాలు అందుకుంటుందా… లేదా అనేది.

Related posts