telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

ఏపీలో మరో ఇద్దరు ఎమ్మెల్యేలకు కరోనా పాజిటివ్!

Corona

ఏపీలో కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో రోజురోజుకూ కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ఆయా శాఖల అధికారులతో పాటు ప్రజాప్రతినిధులు కోవిడ్ బారీన పడుతున్నారు. తాజాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఇద్దరు మ్మెల్యేలు కరోనా మహమ్మారి బారిన పడ్డారు.

గుంటూరు జిల్లా మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డితో పాటు తూర్పు గోదావరి జిల్లా, తుని శాసనసభ్యుడు, ప్రభుత్వ విప్ దాడిశెట్టి రాజాలకు కరోనా పాజిటివ్ వచ్చింది. ఇటీవల తన తండ్రి దశరథరామిరెడ్డి మరణించడంతో అంత్యక్రియల్లో పాల్గొన్న సమయంలో ఆర్కేకు కరోనా సోకినట్టు సమాచారం.

తనకు కరోనా సోకడంతో రెండు వారాల పాటు హోమ్ ఐసోలేషన్ లోకి వెళ్లనున్నానని ప్రకటించిన ఆర్కే, ఇటీవలి కాలంలో తనను కలిసిన వారందరూ తగిన జాగ్రత్తలు తీసుకుని, పరీక్షలు చేయించుకోవాలని ఓ ప్రకటనలో కోరారు., దాడిశెట్టి రాజా మాట్లాడుతూ వైద్య చికిత్సకోసం విశాఖపట్నంలోని ఆసుపత్రికి వెళ్ళినట్టు తెలిపారు.

Related posts