తెలంగాణ రాష్ట్రంలోని బీఈడీ కాలేజీలలో సీట్లభర్తీకి మే 23న నిర్వహించనున్న ఎడ్సెట్-2020 షెడ్యూల్లో స్వల్పమార్పులు చేశారు. వెబ్సైట్లో తలెత్తిన కొన్ని సాంకేతికకారణాల వల్ల గురువారం విడుదల కావాల్సిన ఎడ్సెట్ నోటిఫికేషన్ను ఈ నెల 24వ తేదీకి వాయిదావేశామని సెట్ కన్వీనర్ ప్రొఫెసర్ మృణాళిని తెలిపారు.
ఆన్లైన్లో దరఖాస్తులను ఈ నెల 27 నుంచి స్వీకరించనున్నామన్నారు. రూ.2,000 ఆలస్య రుసుంతో మే 4 వరకు దరఖాస్తుకు గడువు ఉన్నదని.. ఇతర తేదీలు యథాతథంగా ఉంటాయని ఆమె పేర్కొన్నారు.
ఎస్సీ వర్గీకరణపై వ్యాఖ్యలను జగన్ వెనక్కి తీసుకోవాలి: మంద కృష్ణ