telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు విద్యా వార్తలు

ఈసెట్‌ ఫలితాల్లో గందరగోళం.. విద్యార్తులందరికి సున్న మార్కులు!

తెలంగాణ ఇంటర్ బోర్డు ఫలితాల్లో నెలకొన్న తప్పిదాలను మరిచిపోక ముందే సాంకేతిక విద్య, శిక్షణ బోర్డు (టీఎస్ఎస్ బీటీఈటీ)లోనూ అటువంటి తప్పిదాలే చోటు చేసుకున్నాయి. పరీక్ష రాసిన విద్యార్థులందరినీ బోర్డు ఫెయిల్‌ చేసింది. విద్యార్థులందరికీ చివరి సెమిస్టర్‌లో సున్నా మార్కులు వచ్చాయి. ఈ నెల 1న పాలిటెక్నిక్‌ డిప్లొమా చివరి ఏడాది ఫలితాలను బోర్డు విడుదల చేసింది. ఫలితాలు చూసుకున్న విద్యార్థులు ఒక్కసారిగా షాకు కు గురయ్యారు. ఈసెట్‌–2019 టాప్‌ ర్యాంకర్లు సైతం ఫెయిలయ్యారు.

ఈసీఈ, ఈఈఈ బ్రాంచ్‌ విద్యార్థులకు చివరి సెమిస్టర్‌లో ఇండస్ట్రియల్‌ ట్రైనింగ్‌ ఆధారంగా ప్రయోగ విభాగంలో మార్కులు వేయాల్సి ఉంటుంది. వీటిని విద్యార్థి ప్రతిభ ఆధారంగా కాలేజీ యాజమాన్యాలు నిర్దేశిస్తాయి. ఆ మార్కులను కాలేజీ యాజమాన్యమే బోర్డు వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేయాలి. అయితే పలు కాలేజీ యాజమాన్యాలు బోర్డు నిర్దేశించిన తేదీల్లో అప్‌లోడ్‌ చేయలేదు. గడువు పూర్తి కావడంతో అప్‌లోడ్‌ ఆప్షన్‌ను బోర్డు తొలగించింది.

ఈ విషయాన్ని ఆలస్యంగా గుర్తించిన కాలేజీ యాజమాన్యాలు విషయాన్ని బోర్డుకు వివరించాయి. మార్కులను నిర్దేశిత పద్ధతిలో పంపించాలని కోరింది. దీంతో యాజమాన్యాలు విద్యార్థులు మార్కులను పంపించారు. కానీ తీరా ఫలితాల్లో విద్యార్థులకు ఆ మార్కులను చేర్చలేదు. దీంతో ఆగ్రహించిన విద్యార్థుల తల్లిదండ్రులు సోమవారం హైదరాబాద్ మీర్‌పేట్‌ సమీపంలోని ఓ కాలేజీ వద్ద నిరసన చేపట్టినప్పటికీ యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరించింది. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు బోర్డుకు ఫిర్యాదు చేశారు.

Related posts