telugu navyamedia
ఆంధ్ర వార్తలు వార్తలు సామాజిక

గుంటూరులో ముగ్గురు డాక్టర్లకు కరోనా

Corona

ఏపీలో కరోనా వైరస్ చాపాకింద నీరులా విస్తరిస్తోంది. దీంతో అక్కడ రోజురోజుకూ వైరస్ కేసులు పెరుగుతున్నాయి. గుంటూరు జిల్లాలో భారీగా కేసులు వస్తూనే ఉన్నాయి. తాజాగా గుంటూరులోని ప్రభుత్వాసుపత్రిలోనూ కరోనా కలకలం రేగింది. ఏకంగా ముగ్గురు డాక్టర్లు కరోనా మహమ్మారి బారినపడ్డారు.

ఇటీవల అత్యాచారానికి గురై జీజీహెచ్ లో చేరిన ఓ బాలికకు ఈ ముగ్గురు డాక్టర్లు చికిత్స అందించారు. ఆ బాలికతో పాటు, ఆమె తల్లికి కూడా అప్పటికే కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయింది. ఆ బాలికకు చికిత్స అందించడంతో డాక్టర్లకు కూడా సోకింది. చికిత్స అందించే వైద్య సిబ్బందికే కరోనా సోకడంతో గుంటూరులో ఆందోళన వ్యక్తమవుతోంది.

Related posts