telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

ఎగ్జిట్ పోల్ ఫలితాలపై జగన్ శిబిరంలో జోష్!

ycp party

ఎగ్జిట్ పోల్ ఫలితాలు తమకు అనుకూలంగా రావడంతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి శిబిరంలో వైసీపీ నేతలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. శాసనసభ ఎన్నికల్లో వైసీపీ తిరుగులేని మెజారిటీ సాధిస్తుందని, లోకసభ ఎన్నికల్లో టీడీపి కన్నా ఎక్కువ సీట్లు వస్తాయని ఎగ్జిట్ పోల్ ఫలితాలుతెలియజేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఫలితాలు తమకు అనుకూలంగా ఉంటాయని వైసీపీ శిబిరంలో ఆనందం వెల్లివిరుస్తోంది. ఏపీ శాసనసభ ఎన్నికల్లో సిపిఎస్ ఎగ్జిట్ పోల్ సర్వే ప్రకారం తెలుగుదేశం పార్టీకి 37, వైసీపీ కి 130 నుంచి 133 సీట్లు, జనసేనకు 1 సీటు వస్తాయి. ఐన్ న్యూస్- ఐ పిల్స్ సర్వే ప్రకారం టీడీపికి 55 నుంచి 62 సీట్లు, వైసిపికి 110 నుంచి 120 సీట్లు, జనసేనకు 3 సీట్లు వస్తాయి. విడీపి అసోసియేట్స్ సర్వే ప్రకారం, టీడీపికి 54 నుంచి 60, వైసిపికి 111 నుంచి 121 సీట్లు, జనసేనకు 0 నుంచి 4 సీట్లు వస్తాయి.

ఐన్ఎస్ఎస్ ఎగ్జిట్ పోల్ సర్వే ప్రకారం టీడీపికి 118, వైసీపీ కి 52, జనసేనకు 5 సీట్లు వస్తాయి. ఎలైట్ సర్వే ప్రకారం టీడీపికి 106 సీట్లు, వైసిపికి 68 సీట్లు, జనసేనకు 1 సీటు వస్తాయి. టీడీపికి 49, వైసీపీ కి 116, జనసేనకు 2 సీట్లు వస్తాయని పోల్లాబ్ ఎగ్దిట్ పోల్ సర్వే తేల్చింది. లోకసభ ఎన్నికల్లోనూ వైఎస్సార్ కాంగ్రెసు పార్టీకి అత్యధిక స్థానాలు వస్తాయని ఎగ్జిట్ పోల్ సర్వేలు తెలియజేస్తున్నాయి. రాష్ట్రంలోని 25 స్థానాల్లో వైసిపికి 18 నుంచి 20 స్థానాలు వస్తాయని ఇండియా టుడే – ఆక్సిస్ ఎగ్జిట్ పోల్ అంచనా వేసింది. తెలుగుదేశం పార్టీకి 4 నుంచి 6 సీట్లు మాత్రమే వస్తాయని తేల్చింది. వైసీపీ కి 45 శాతం ఓట్లు వస్తాయని, టీడీపికి 38 శాతం ఓట్లు వస్తాయని చెప్పింది.

టైమ్స్ నౌ – విఎంఆర్ ఎగ్జిట్ పోల్ సర్వే ప్రకారం వైసీపీ కి 18 లోకసభ స్థానాలు వస్తాయి. తెలుగుదేశం పార్టీ 7 స్థానాలకే పరిమితమవుతుంది. బిజెపి తన రెండు సీట్లను కోల్పోయే అవకాశం ఉంది. న్యూస్ ఎక్స్, ఇండియా న్యూస్, మైనేత సర్వేలు వైసీపీ కి 20 స్థానాలు, టీడీపికి 5 స్థానాలు వస్తాయని తేల్చాయి.

న్యూస్ 18కు చెందిన ఐపిఎస్ఓఎస్ సర్వే ప్రకారం  వైసీపీ కి 13 నుంచి 14 సీట్లు, తెలుగుదేశం పార్టీకి 10 నుంచి 12 సీట్లు వస్తాయి. రిపబ్లిక్ టీవీ- సీ ఓటర్ సర్వే ప్రకారం తెలుగుదేశం పార్టీకి 14 సీట్లు, వైసిపికి 13 నుంచి 16 సీట్లు వస్తాయి. న్యూస్ 24 – టుడేస్ చాణక్య సర్వే ప్రకారం… తెలుగుదేశం పార్టీకి 17 సీట్లు, వైసీపీకి 8 సీట్లు వస్తాయి. ఎక్కువ ఎగ్జిట్ పోల్ సర్వేలు వైఎస్ జగన్ కు అనుకూలంగా వచ్చాయి. దీంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలోని వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ జెండా ఎగురవేస్తుందని వైసీపీ నేతలు దీమా వ్యక్తం చేస్తున్నారు.

Related posts