telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు సామాజిక

మహాత్ముని మాటలు కళ్లకు కడుతున్నాయి: విజయశాంతి

Congress vijayashanti comments Modi Kcr

 కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో తాజా పరిణామాలపై కాంగ్రెస్ నాయకురాలు విజయశాంతి సోషల్ మీడియా వేదికగా స్పందించారు. నాడు మహాత్ముని మాటలు నేటి పరిస్థితులను కళ్లకు కడుతున్నాయని విజయశాంతి పేర్కొన్నారు. కరోనా నేపథ్యంలో పెద్ద పెద్ద వ్యాపార సంస్థలన్నింటినీ మూసివేసి నిత్యావసరాలను మాత్రమే ప్రజలకు ప్రభుత్వం అందుబాటులో ఉంచింది. దీనిని చూస్తుంటే నాడు మహాత్ముడు.. ప్రకృతి ప్రతి ప్రాణి ఆకలిని మాత్రమే తీర్చుతుంది.. అత్యాశను కాదు అన్న మాటలు గుర్తొస్తున్నాయని విజయశాంతి పేర్కొన్నారు.

ప్రకృతిలో ప్రతి ప్రాణి ఆకలినీ తీర్చగలదని భారతదేశపు జాతిపితా ఆనాడు చెప్పిన భాష్యం సత్యమై.. వాస్తవమై.. ఈ రోజు అనేక దేశాలు, ప్రభుత్వాలు, అధికార వ్యవస్థలు అతలాకుతలమవుతూ అత్యాశల వ్యాపార వ్యవస్థలను మూసివేసి ఆకలి తీర్చే ప్రకృతిమాత ప్రసాదాలైన నిత్యావసరాలను ప్రజలకు అందించటానికి సతమతమవుతున్నాయి. మీ ప్రవచన విలువలు భారతావనికే కాదు యావత్ ప్రపంచానికి నిత్య సుభాషితాలని విజయశాంతి పోస్టులో పేర్కొన్నారు.

Related posts