telugu navyamedia
రాజకీయ వార్తలు

తమతో కలసి రావాలి.. రజనీకాంత్ ను కోరుతున్న బీజేపీ నేతలు!

rajinikanth on loksabha election support

సూపర్ స్టార్ రజినీకాంత్ కొత్త పార్టీని ప్రకటిస్తారనే ప్రచారం తమిళనాడు లో ఊపందుకొంది. సంక్రాంతి పండుగ తర్వాత కొత్త పార్టీని పెట్టేందుకు రజినీ ముహూర్తం ఖరారు చేసినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో, రజినీ తమతో కలసి రావాలని బీజేపీ నేతలు కోరుతున్నారు.

ఇటీవల చెన్నైలో జరిగిన ఓ కార్యక్రమానికి బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న రజినీకాంత్ మోదీ, అమిత్ షాలపై ప్రశంసలు కురిపించారు. దీంతో, బీజేపీకి రజినీ దగ్గరవుతున్నారనే ప్రచారం కూడా జరుగుతోంది. తాజాగా తమిళ నటుడు, బీజేపీ నేత ఎస్వీ శేఖర్ మాట్లాడుతూ తమిళనాడులో మోదీ వ్యతిరేకులంతా ఏకమయ్యరని చెప్పారు. ఈ నేపథ్యంలో రజినీకాంత్ బీజేపీతో చేతులు కలిపితే తప్పేముందని ఆయన ప్రశ్నించారు.

Related posts