సూపర్ స్టార్ రజినీకాంత్ కొత్త పార్టీని ప్రకటిస్తారనే ప్రచారం తమిళనాడు లో ఊపందుకొంది. సంక్రాంతి పండుగ తర్వాత కొత్త పార్టీని పెట్టేందుకు రజినీ ముహూర్తం ఖరారు చేసినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో, రజినీ తమతో కలసి రావాలని బీజేపీ నేతలు కోరుతున్నారు.
ఇటీవల చెన్నైలో జరిగిన ఓ కార్యక్రమానికి బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న రజినీకాంత్ మోదీ, అమిత్ షాలపై ప్రశంసలు కురిపించారు. దీంతో, బీజేపీకి రజినీ దగ్గరవుతున్నారనే ప్రచారం కూడా జరుగుతోంది. తాజాగా తమిళ నటుడు, బీజేపీ నేత ఎస్వీ శేఖర్ మాట్లాడుతూ తమిళనాడులో మోదీ వ్యతిరేకులంతా ఏకమయ్యరని చెప్పారు. ఈ నేపథ్యంలో రజినీకాంత్ బీజేపీతో చేతులు కలిపితే తప్పేముందని ఆయన ప్రశ్నించారు.