భారత నావికా దళానికి చెందిన మిగ్ శిక్షణా విమానం ఈ రోజు కుప్పకూలింది. గోవాలోని దబోలిం అంతర్జాతీయ విమానశ్రయానికి సమీపంలోనే ఈ సంఘటన చోటుచేసుకున్నట్టు సీనియర్ డిఫెన్స్ అధికారి ఒకరు వెల్లడించారు. అయితే అందులో ప్రయాణిస్తున్న పైలెట్లు క్షేమంగా బయటపడడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
విమానం కూలిపోయే ముందే పైలెట్లు విమానం నుంచి దూకేశారు. వారిప్పుడు క్షేమంగా ఉన్నారు. ప్రమాదం జరిగిన సమయంలో విమానం రోజువారీ శిక్షణలో ఉందిని గోవాలోని ఇండియన్ నేవీ ఫ్లాగ్ ఆఫీసర్ రియర్ అడ్మిరల్ ఫిలిపోస్ జార్జ్ పైనుమూటిల్ పేర్కొన్నారు. దక్షిణ గోవా జిల్లాలోని వెర్నా ప్లాట్యూ సమీపంలో విమాన శకలాలను గుర్తించేందుకు భారత నావికాదళంతో పాటు జిల్లా అధికారులు ప్రయత్నిస్తున్నారు.