చెన్నైలో 27 మందికి కరోనా పాజిటివ్ అని నిన్నటి వరకు లెక్కలు ఉండగా తాజాగా ఈరోజు మరో పది మందికి పాజిటివ్ అని తేలింది. విధి నిర్వహణలో భాగంగా పలువురు జర్నలిస్టులు వేగంగా వైరస్ బారిన పడుతుండడంతో మీడియా సంస్థలు ఆందోళన చెందుతున్నాయి.
వారు క్షేత్ర స్థాయి పర్యటన అనంతరం కార్యాలయాలకు వస్తే అక్కడి సిబ్బందికి ఎక్కడ విస్తరిస్తుందో అన్న ఆందోళన నెలకొంటోంది. అదే సమయంలో క్షేత్ర స్థాయి విధులు నిర్వహించే వారికి వైరస్ సోకకుండా ఏ చర్యలు చేపట్టాలో అర్థంకాక తలలు పట్టుకుంటున్నారు. దేశంలో అత్యధిక కేసులు నమోదవుతున్న మహారాష్ట్రలో ఇప్పటికే 50 మంది జర్నలిస్టులు కరోనా బారినపడ్డారు.