telugu navyamedia
క్రైమ్ వార్తలు తెలంగాణ వార్తలు వార్తలు

ఔటర్‌ రింగ్‌ రోడ్డులో ఘోర ప్రమాదం..దంపతుల దుర్మరణం

Accident

హైదరాబాద్ ఔటర్‌ రింగ్‌ రోడ్డు వద్ద ఘోర ప్రమాదం జరిగింది. అప్పా జంక్షన్‌ వద్ద హిమాయత్‌ సాగర్‌ సర్వీస్‌ రోడ్డులోబైకును ఢీకొని కారు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో మహబూబ్‌నగర్‌కు చెందిన నాగరాజు దంపతులు మృతిచెందగా.. కుమార్తెకు తీవ్రగాయాలయ్యాయి. చిన్నారిని మెరుగైన వైద్యం నిమిత్తం నీలోఫర్‌ ఆస్పత్రికి తరలించారు.

మైనర్‌ కారు నడపడంతో ప్రమాదం జరిగినట్లు పోలీసులు గుర్తించారు. మితిమీరిన వేగమే ప్రమాదానికి కారణమని స్థానికులు చెబుతున్నారు. బైక్‌ను ఢీకొట్టి రోడ్డు పక్కనే ఉన్న కాల్వలోకి కారు దూసుకెళ్లింది. కారులో ఉన్న నలుగురు మైనర్లలో ఇద్దరికి గాయాలయ్యాయి. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకోయి ధర్యాప్తు చేస్తున్నారు.

Related posts