ఏపీ సీఎం జగన్ పై టీడీపీ అధినేత చంద్రబాబు మరోసారి మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్ ను జగన్ భ్రష్టు పట్టిస్తున్నారని అన్నారు. ఆరు నెలల్లో ‘మంచి’ ముఖ్యమంత్రి అనిపించుకుంటానని జగన్ చెప్పారని గుర్తు చేశారు.
కానీ ఐదు నెలల్లోనే రాష్ట్రాన్ని ‘ముంచుతున్న’ ముఖ్యమంత్రిగా జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకున్నారని ఎద్దేవా చేశారు. దీనికి ఈ పత్రికా కథనాలే నిదర్శనమంటూ నవంబర్ 14న ఇండియన్ ఎక్స్ ప్రెస్ లో వచ్చిన కథనాన్ని ట్విట్టర్ లో షేర్ చేశారు. తన మీద కక్షతో తాను నిలబెట్టిన వాటిని కూల్చే పనిని ఆపేసి, ప్రజలకు ఏం చేయాలో ఇప్పటికైనా ఆలోచించాలని హితవు పలికారు.
అధిక ధరలకు ఇసుక బస్తాల విక్రయం: చంద్రబాబు