telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

చిటికెలు వేయడం మానుకోవాలి..చంద్రబాబుకు కొడాలి నాని వార్నింగ్

kodali nani ycp

టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడుపై ఏపీ మంత్రి మంత్రి కొడాలి నాని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. చంద్రబాబు ఒళ్లు దగ్గరపెట్టుకోవాలని అన్నారు. కరోనా నుంచి తప్పించుకోవడంపై బాబు దృష్టి పెట్టుకోవాలని అన్నారు. అంతే తప్ప తమ ముందుకొచ్చి చిటికెలు వేయడం మానుకోవాలని మంత్రి హెచ్చరించారు.

చంద్రబాబు ఓ దళారని రైతుల నుంచి తక్కువకు కొని హెరిటేజ్ లో అమ్ముకుంటుంటాడని విమర్శించారు. హుద్ హుద్ తుపానుకు ఎదురెళ్లానని చెప్పుకుంటున్న చంద్రబాబు కరోనాను చూసి ఎందుకు పారిపోతున్నారని ప్రశ్నించారు. ఈ సందర్భంగామాజీమంత్రి దేవినేని ఉమపై కూడా కొడాలి నాని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తనను బూతుల మంత్రి అనడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను బూతులు తిడితే చంద్రబాబు, దేవినేని బతికుంటారా? అని మండిపడ్డారు.

Related posts