ఈరోజు భారత ప్రజలంతా 74వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా పలువురు రాజకీయ, సినీ కళకారులు దేశ ప్రజలకు స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసారు. ఇక బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ కూడా ఓ దేశ భక్తి పాట పాడి స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశాడు. ప్రముఖ నిర్మాత అతుల్ అగ్నిహోత్రి ఈ వీడియోను ఇన్స్ట్రాగ్రామ్లో పోస్ట్ చేయగా.. ప్రస్తుతం అది వైరల్ అయింది. ఈ వీడియోలో సల్మాన్ ‘సారే జహాసే అచ్చా’అనే గీతాన్ని ఆలపించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. కాగా లాక్ డౌన్ మొదలైన నాటి నుంచి తన పాన్వెల్ ఫార్మ్ హౌస్ దాటి రాని సల్మాన్ ఖాన్, అక్కడి నుంచే అని పనులూ చెక్కబెట్టేస్తున్న వైనం తెలిసిందే. అయితే ఈ సమయంలో ఆయన కొన్ని పాటలను విడుదల చేసి అభిమానులను అలరించాడు. ‘ప్యార్ కరోనా’,‘తెరే బినా’పాటలతో పాటు ‘భాయ్ భాయ్’అంటూ జాతి సమైక్యతకు చిహ్నంగా నిలిచే ర్యాప్ సాంగ్ పాడి అభిమానుల్లో సంతోషాన్ని నింపాడు.
previous post