telugu navyamedia
క్రీడలు వార్తలు

సన్‌రైజర్స్ ఫ్యాన్స్ కు శుభవార్త…!

ఐపీఎల్ 2021 సీజన్‌ ప్రారంభానికి ముందు సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీ అభిమానులకు ఓ శుభవార్త వచ్చింది. అయితే గత ఐపీఎల్ ముగిసిన తర్వాత ఆసీస్ పర్యనట వెళ్లిన భారత జట్టుతో ఆడుతున్న సమయంలో సన్‌రైజర్స్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ గాయానికి గురై దాదాపు అన్ని మ్యాచ్ లకు దూరమైన విషయం తెలిసిందే. అయితే చివరి రెండు టెస్టులు ఆడిన వార్నర్ తన గాయని మరింత రెచ్చేలా చేసాడు. దాంతో అతనికి అతనికి 6 నెలల విశ్రాంతి అవసరమనే వార్తలు కూడా వినిపించాయి. దాంతో అతను ఈ ఏడాది ఐపీఎల్ ఆడుతాడా… లేదా అనే అనుమానాలు కూడా వచ్చాయి. కానీ వాటన్నింటికి డేవిడ్ వార్నర్ బ్యాట్‌తోనే జావాబిచ్చాడు. ఆస్ట్రేలియా దేశవాళీ క్రికెట్‌లో న్యూ సౌత్ వేల్స్ తరఫున ఆడిన డేవిడ్ వార్నర్ సెంచరీ తో రెచ్చి పోయాడు. ఈ మ్యాచ్ అనంతరం వార్నర్ మాట్లాడుతూ.. ‘బ్యాటింగ్ చేసే క్రమంలో నేనే ఎటువంటి సమస్యకు గురవ్వలేదు. రాబోయే చాలెంజ్‌ల కోసం ఎదురు చూస్తున్నాను’అని చెప్పాడు. తప్పకుండా ఐపీఎల్ ఆడాలని వార్నర్ భావిస్తున్నట్లు అతని మాటల్లో స్పష్టంగా తెలుస్తున్నది. అయితే ఈ ఐపీఎల్ 2021 వచ్చే నెల 9 నుండి ప్రారంభం కానున్న విషయం తెలిసిందే.

Related posts