telugu navyamedia
ఆంధ్ర వార్తలు వార్తలు

స్ధానిక ఎన్నికలు వేరు… పార్లమెంట్ ఎన్నికలు వేరు.

ఏపీలో పార్టీలకు విశ్రాంతి లేకుండా వరుస ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ మధ్యనే అక్కడ తిరుపతి ఉప ఎన్నికల తేదీ వచ్చేసింది. అయితే ఈ ఎన్నికల పై మాట్లాడుతూ ఇందులో గెలుపు మాదేనని ధీమా వ్యక్తం చేశారు ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు. స్ధానిక సంస్ధ ఎన్నికలు వేరు… పార్లమెంట్ ఎన్నికలు వేరన్న ఆయన.. తిరుపతి లోక్‌సభ బై పోల్‌లో విజయం తమదేననే నమ్మకాన్ని వ్యక్తం చేశారు.. అయినా, స్థానిక సంస్థల ఎన్నికలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎలా గెలిచిందో ప్రజలందరికీ తెలుసని వ్యాఖ్యానించారు. అయితే, కింది స్ధాయిలో జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ కేడర్ బలంగా ఉందన్న ఆయన.. ఇది లోక్‌సభ ఎన్నికలకు ఎంతో ఉపయోగపడుతుందన్నారు. అవినీతికి బీజేపీ వ్యతిరేకం అన్నారు సోము వీర్రాజు.. చంద్రబాబు తప్పు చేసుంటే శిక్ష పడుతుందని.. రేపు వైఎస్ జగన్ అవినీతి చేసినా శిక్ష పడడం ఖాయమంటూ హాట్ కామెంట్లు చేశారు. అయితే వచ్చే నెలలో ఇక్కడ ఎన్నికలు జరగనుండగా ఆ తర్వాతి నెల మే 2న ఫలితాలు రానున్నాయి.

Related posts