telugu navyamedia
ఆంధ్ర వార్తలు క్రైమ్ వార్తలు రాజకీయ వార్తలు

కొల్లు రవీంద్ర బెయిల్ పిటిషన్ కొట్టివేత

kollu ravindra

మచిలీపట్నం మార్కెట్ మాజీ చైర్మన్ మోకా భాస్కరరావు హత్యకేసులో మాజీ మంత్రి, టీడీపీ నేత కొల్లు రవీంద్ర ఏ-4 నిందితుడిగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఈ కేసులో బెయిల్ కోరుతూ కొల్లు రవీంద్ర కృష్ణా జిల్లా కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది.

కొల్లు రవీంద్ర బయటికి వస్తే ఈ కేసుకు సంబంధించిన అంశాలను ప్రభావితం చేసే అవకాశం ఉందని పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదనలను కోర్టు సమర్థించింది. కొల్లు రవీంద్ర ఈ హత్య కేసులో కుట్రదారుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం ఆయన రాజమండ్రి కేంద్ర కారాగారంలో రిమాండ్ లో ఉన్నారు.

Related posts