telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు

చెల్లని రూపాయి గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు : కడియం

kadiyam srihari

ఎమ్మెల్యే పదవిని అడ్డుపెట్టుకొని పదవులు అమ్ముకుంటున్నారని ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యను ఉద్దేశించి… కడియం శ్రీహరి ఘాటు వ్యాఖ్యలు చేశారు.. జనగామ జిల్లా జాఫర్గడ్ మండలం ఓబులపూర్ గ్రామంలో కబడ్డీ క్రీడల ముగింపు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ కడియం శ్రీహరి పాల్గొన్నారు. అనంతరం మాట్లాడుతూ.. చేతకానివారు, ఒక్క రూపాయి సహాయం చేయనివారు కూడా  మాట్లాడుతున్నాడని… చెల్లని రూపాయి గురించి మాట్లాడాల్సిన అవసరం తనకు లేదన్నారు.  పనిచేసే వారిని నిరుత్సాహ పరుచడం కాదని,  మగాడైతే ఆర్థిక  సహాయం చేయాలన్నారని పేర్కొన్నారు. తాను  ఎమ్మెల్యేగా, మంత్రిగా ఉన్నప్పుడు  పదవి ఇప్పిస్తాననో, పనులు ఇప్పిస్తాననో… ఒక్కరి దగ్గర ఛాయ్ తాగినా, రూపాయి తీసుకున్న ముక్కు నేలకు రాస్తానని సవాల్ విసిరారు. పదవులు, పనులను అమ్ముకుంటూ..  సిగ్గులేకుండా మళ్లీ మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. నెత్తిమీద పది రూపాయలు పెడితే అమ్ముడు పోనివారు కూడా మాట్లాడుతున్నారని మండిపడ్డారు.

Related posts