ఏపీలో కరోనా వైరస్ విజృంభించడంతో భారీ సంఖ్యలో కేసులు వెలుగు చూస్తున్నాయి. ఇప్పటికే ఎందరో ప్రజాప్రతినిధులు కోవిడ్ బారిన పడ్డ విషయం తెలిసిందే. తాజాగా ఏపీ బీజేపీ ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్రెడ్డికి కరోనా సోకినట్టు నిర్ధారణ అయింది. జలుబు, జ్వరం తగ్గకపోవడంతో అనుమానంతో కరోనా పరీక్షలు చేయించుకోగా వైరస్ సోకినట్టు తేలింది.
దీంతో వైద్యుల సలహా మేరకు ఆయన హోం ఐసోలేషన్లోకి వెళ్లారు. ప్రస్తుతం తన ఆరోగ్యం బాగానే ఉన్నట్టు పేర్కొన్నారు. తిరుమల డిక్లరేషన్ వివాదంపై బీజేపీ ఆధ్వర్యంలో మొన్న నిర్వహించిన నిరసన కార్యక్రమాల్లో విష్ణువర్ధన్రెడ్డి పాల్గొన్నారు. దీంతో ఈ కార్యక్రమంలో తనతోపాటు పాల్గొన్న నేతలు, కార్యకర్తలు వెంటనే కరోనా పరీక్షలు చేయించుకోవాలని సూచించారు.
ఎన్నికల్లో పోత్తులపై పవన్ తో చర్చలు: కేఏ పాల్