telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు సినిమా వార్తలు

నేటి నుంచి 15 రాష్ట్రాల్లో థియేటర్లు ఓపెన్..మరి తెలుగు రాష్ట్రాల్లో ఎప్పుడంటే

Theatre

కేంద్ర ప్రభుత్వం అన్ లాక్ 5.ఓ గైడ్ లైన్స్ ను విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ గైడ్ లైన్స్ లో సినిమా హాల్స్ కు మల్టీ ప్లెక్స్ లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది కేంద్రం. లాక్ డౌన్ కారణంగా దాదాపు ఏడూ నెలలుగా సినిమా థియేటర్లు మూతపడ్డాయి. ఇక కేంద్రం ఇచ్చిన అనుమతితో ఇవాళ్టి నుంచి సినిమా హాల్స్ , మల్టీ ప్లెక్స్ లు రీఓపెన్ కానున్నాయి. అన్ లాక్ 5.ఓ లో భాగంగా నేటి నుంచి 15 రాష్ట్రాల్లో 50 శాతం సీటింగ్ కెపాసిటీ తో సినిమా థియేటర్లు తెరచుకోనున్నాయి. అయితే..తెలుగు రాష్ట్రాల్లో మాత్రం సినిమా థియేటర్లు రీ-ఓపెన్ కావాలంటే మరికొంత కాలం ఆగాల్సిందే. దీనికి కారణం తెలంగాణ ప్రభుత్వం థియేటర్ల రీ-ఓపెన్ కు అనుమతి ఇవ్వలేదు. అటు… థియేటర్ల రీ-ఓపెనింగ్ కు బ్రేక్ పడింది. ఏపీకి చెందిన 13 జిల్లాల సినిమా ఎగ్జిబిటర్లు థియేటర్లు తెరవకూడదని నిర్ణయం తీసుకున్నారు. థియేటర్లు తెరవాలంటే ఒక్కో దానికి రూ. 10 లక్షల అదనపు ఖర్చు అవుతుందని, 50 శాతం ఎక్కుపెన్సీ తో థియేటర్ల నిర్వహణ కష్టమని ఎగ్జిబిటర్లు భావించి..ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.

Related posts