telugu navyamedia
క్రీడలు వార్తలు

8 వికెట్లు కోల్పోయిన ఇంగ్లాండ్….

మేతేరా వేదికగా ఇంగ్లాండ్ తో జరుగుతున్న చివరి టెస్టులో భారత్ విజయం వైపుగా ఆడుగులు వేస్తుంది. అయితే నిన్న ఆట సమయం ముగిసే సమయానికి 294 పరుగులు చేసి 7 వికెట్లు కోల్పోయిన భారత్ ఈరోజు 365 పరుగులకు ఆల్ ఔట్ అయింది. దాంతో ఇంగ్లాండ్ పై 160 పరుగుల ఆధిక్యం సంపాదించింది. ఇక ఈరోజు తమ రేండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లాండ్ ను అశ్విన్ అలాగే అక్షర్ కలిసి పరాజయం వైపుగా నడిపిస్తున్నారు. ఇప్పటివరకు 112 పరుగులు చేసిన ఇఇంగ్లాండ్ 8 వికెట్లు కోల్పోయింది. అయితే ఇంగ్లాండ్ ఇంకా భారత్ కంటే 48 పరుగులు వెనకబడి ఉంది. అయితే ఈరోజు ఆట ముగియడానికి ఇంకా 20 ఓవర్లు మిగిలి ఉండటంతో భారత్ ఈరోజు విజయం సాధించేలా కనిపిస్తుంది. అయితే భారత్ ఈ మ్యాచ్ లో విజయం సాధిస్తే జూన్ లో జరిగే ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ లో న్యూజిలాండ్ తో తలపడేందుకు క్వాలిఫైవ్ అవుతుంది. చూడాలి మరి భారత్ ఈరోజే విజయం సాధించగలదా… లేదా అనేది.

Related posts