telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

జూమ్ యాప్ తమకు కొత్త మార్గాన్ని చూపింది: చంద్రబాబు

chandrababu

లాక్ డౌన్ సమయంలో జూమ్ యాప్ తమకు కొత్త మార్గాన్ని చూపిందని తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు అన్నారు. ఎటువంటి సమస్యలకైనా అందుబాటులో ఉన్న టెక్నాలజీ పరిష్కార మార్గాన్ని చూపిస్తుందన్న తన నమ్మకం మరోసారి బలపడిందని వ్యాఖ్యానించారు. నేటి నుంచి పార్టీ మహానాడు కార్యక్రమం జరుగనుండగా, భౌతిక దూరం పాటిస్తూ, డిజిటల్ సోషలైజేషన్ దిశగా సాగుతున్నామని తెలిపారు.

ఈ సంవత్సరం జరుగుతున్న డిజిటల్ మహానాడు కూడా అటువంటిదేనని తెలిపారు.ప్రతి సంవత్సరమూ అసంఖ్యాకంగా వచ్చే నేతలు, కార్యకర్తల మధ్య సాగే మహానాడుకు ఈ సంవత్సరం నిబంధనలు అడ్డుగా నిలిచాయని అన్నారు. ఇండియాలోనే తొలిసారిగా ఓ రాజకీయ సమావేశం డిజిటల్ మాధ్యమంగా సాగుతోందని అన్నారు.టీడీపీకి చెందిన వారంతా తమ స్మార్ట్ ఫోన్లలో జూమ్ యాప్ ను ఇన్ స్టాల్ చేసుకుని ఈ కార్యక్రమంలో పాల్గొనాలని పిలుపునిచ్చారు.

Related posts