telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ వార్తలు

సీఎం జగన్‌ ఇంటి ముందు మహిళ ఆత్మహత్యయత్నం

గుంటూరు జిల్లా తాడేపల్లిలోని ఏపీ సీఎం జగన్‌ క్యాంపు కార్యాలయం వద్ద కలకలం రేగింది. నెల్లూరు జిల్లా చిట్టమూరు మండలం చిల్లమూరు గ్రామానికి చెందిన ఓ కుటుంబం సీఎం జగన్‌ క్యాంప్‌ కార్యాలయం వద్ద ఆత్మహత్యకు యత్నించింది. నెల్లూరు జిల్లా దత్తలూరు తహసీల్దార్‌ తమను మోసం చేశారని ఆరోపిస్తూ… నాగార్జున, భవానీ దంపతులు ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్యకు ప్రయత్నించారు. నెల్లూరు నుంచి కుటుంబంతో సహా తాడేపల్లికి వచ్చిన నాగార్జున ఫ్యామిలీ.. సర్వీసు రోడ్డులో నుంచి సీఎం జగన్‌.. ఇంటికి వెళ్లే చెక్‌ పోస్ట్‌ వద్దకు చేరుకుంది. సీఎంను ఎలాగైనా కలవాలని పోలీసులను కోరుతూనే.. భవానీ తన వెంట తెచ్చుకున్న పురుగుల మందు తాగేసింది. దీంతో అక్కడే ఉన్న పోలీసులు ఆమెను ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆ మహిళకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. అయితే.. ఈ ఘటనపై ఉన్నతాధికారులు ఆరా తీస్తున్నట్లు సమాచారం.

Related posts