telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

ప్రభుత్వ నిర్లక్ష్యంతో రైతులు బలైపోతున్నారు: చంద్రబాబు

chandrababu speech on 12 hrs diksha

వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు మరోసారి మండిపడ్డారు. ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా వేరుశనగ, మొక్కజొన్న రైతులు బలైపోతున్నారని మొక్కజొన్న క్వింటా ధర రూ.2100 నుంచి రూ.1500కు పడిపోయే దాకా ఈ ప్రభుత్వం ఏం చేస్తోందని ప్రశ్నించారు.

వైసీపీ ప్రభుత్వం చేతకానితనంతో దళారులు స్వైరవిహారం చేస్తున్నారని దుయ్యబట్టారు. తగిన సంఖ్యలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి దళారుల బారి నుంచి రైతాంగాన్ని కాపాడాలని డిమాండ్ చేశారు.వేరుశనగ పంట దిగుబడి వచ్చి రైతులు అమ్ముకోడానికి సిద్ధపడగానే మార్కెట్‌లో క్వింటా ధర రూ.8,200 నుంచి రూ.4 వేలకు పడిపోయిందని, ఒక్క నెలలో రైతు ఎకరానికి రూ. 20వేలు నష్టపోయాడని అన్నారు.

Related posts