telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

సత్యారావు భౌతికకాయానికి జగన్ నివాళులు

balireddy cm jagan vizag

విశాఖపట్టణంలో నిన్న జరిగిన రోడ్డు ప్రమాదంలో మాజీ మంత్రి బలివాడ సత్యారావు మృతి చెందిన విషయం తెలిసిందే. ఆర్కే బీచ్‌ రోడ్డులో వాకింగ్‌కు వెళ్లిన మాజీ మంత్రి రోడ్డు దాటుతుండగా ద్విచక్ర వాహనం ఢీకొనడంతో సంఘటనా స్థలంలోనే మృతిచెందారు. మాజీ మంత్రికి నివాళులు అర్పించడానికి శనివారం ఉదయం సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విశాఖ చేరుకున్నారు.

విశాఖ నుంచి నేరుగా పీఎస్‌పేటకు వెళ్లిన జగన్ బాలిరెడ్డి భౌతిక కాయానికి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా సత్యారావు కుటుంబ సభ్యులను సీఎం పరామర్శించారు. సత్యారావు మృతి చోడవరం నియోజకవర్గానికి తీరనిలోటు అని అన్నారు. జగన్ వెంట వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి, మంత్రి అవంతి శ్రీనివాస్, ఎమ్మెల్యే అమరనాథ్‌ రెడ్డి, స్థానిక నేతలు ఉన్నారు.

Related posts