telugu navyamedia
వార్తలు సినిమా వార్తలు

ద్రౌపది ముర్ము చేతుల మీదుగా పద్మవిభూషణ్ అవార్డు అందుకున్న చిరంజీవి

సినీ రంగంలో చిరంజీవి చేసిన సేవలకుగాను వరించిన అవార్డు, మెగాస్టార్ చిరంజీవి భారత రెండో అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్ అందుకున్నారు. గురువారం సాయంత్రం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా మెగాస్టార్ ఈ పురస్కారాన్ని అందుకున్నారు.

సీనియర్ నటి వైజయంతిమాలకు కూడా పద్మవిభూషణ్ పురస్కారం అందించారు.

న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో గురువారం పద్మ పురస్కారాల ప్రదానోత్సవం జరిగింది.
ఈ సంవత్సరం జనవరి 25న 132 మందికి అవార్డులు ప్రకటించారు.

ఇక ఈ వేడుకలో చిరంజీవి భార్య సురేఖతో పాటు తనయుడు రామ్ చరణ్, కోడలు ఉపాసన కూడా పాల్గొన్నారు.

Related posts