లాక్ డౌన్ నిబంధనల్లో సడలింపు ఇవ్వడంతో తిరుమలలో దర్శనాలు తిరిగి ప్రారంభమైన సంగతి తెలిసిందే. రోజుకు 6 వేల మంది వరకూ దర్శనాలు కల్పిస్తున్న టీటీడీ అధికారులు, దర్శనాల సంఖ్యను పెంచారు. రోజుకు మూడు వేల మందికి ఉచిత దర్శనం టోకెన్లను ఇవ్వాలన్న నిర్ణయం తీసుకున్నారు. ఇందుకోసం అలిపిరిలోని భూదేవీ కాంప్లెక్స్ లో ప్రత్యేక కౌంటర్ ను ఏర్పాటు చేసింది.
నేటి నుంచి టికెట్లను జారీ చేయనున్నామని ప్రకటన వెలువడగానే, భక్తులు పెద్ద సంఖ్యలో అలిపిరికి చేరుకున్నారు. భక్తులంతా భౌతిక దూరం నిబంధనలు పాటించేలా చూసేందుకు అధికారులు నానా తంటాలు పడ్డారు. ఈ నెల 30 వరకూ టికెట్లను జారీ చేశామని, వచ్చే నెల 11 వరకూ ఆన్ లైన్ టికెట్ల కోటా పూర్తయిందని అధికారులు తెలిపారు. ఆపై టికెట్లను త్వరలోనే విడుదల చేస్తామని వెల్లడించారు.
బీజేపీకి పెరుగుతున్న ఆధరణను చూసి టీఆర్ఎస్ భయపడుతుంది: లక్ష్మణ్