సూర్య, రకుల్ ప్రీత్ సింగ్, సాయిపల్లవి హీరోహీరోయిన్లుగా శ్రీరాఘవ దర్శకత్వంలో డ్రీమ్ వారియర్ పిక్చర్స్, రిలయన్స్ ఎంటర్టైన్మెంట్స్ పతాకాలపై రూపొందిన చిత్రం ‘ఎన్.జి.కె’. ఈ చిత్రాన్ని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో సత్యసాయి ఆర్ట్స్ పతాకంపై కె.కె.రాధామోహన్ అందిస్తున్నారు. సినిమా మే 31న ప్రపంచవ్యాప్తంగా విడుదలకాబోతోంది. ఈ సందర్భంగా మంగళవారం హైదరాబాద్లో జరిగిన ప్రీరిలీజ్ ఈవెంట్లో బిగ్ టికెట్ను హీరో సూర్య ఆవిష్కరించి ప్రముఖ నిర్మాత కె.కె.రాధామోహన్కి అందించారు.
ఈ కార్యక్రమంలో హీరోయిన్ సాయిపల్లవి మాట్లాడుతూ.. ‘‘హైదరాబాద్కు వస్తే సొంత ఇంటికి వచ్చిన ఫీలింగ్ ఉంటుంది. నాకు చిన్నప్పట్నుంచి సూర్య సార్ అంటే చాలా ఇష్టం. ఆయనతో ఇప్పుడు సినిమా చేయడం కలలాగా ఉంది. నాకొక మూమెంట్. ఆయన సెట్లో చాలా సింపుల్గా ఉంటారు. అందరితో ఫ్రెండ్లీగా ఉంటారు. షూటింగ్ సమయంలో ఎంతగానో సపోర్ట్ అందించారు. శ్రీరాఘవ గారు ఓ విజనరీతో సినిమా చేస్తారు. ఆయన ప్రతి క్యారెక్టర్ను డిఫరెంట్గా చూపిస్తారు. ఈ సినిమా ద్వారా చాలా నేర్చుకున్నాను. ఈ సినిమాలో నాకు సపోర్ట్ చేసిన నటీనటులు, సాంకేతిక నిపుణులకు థ్యాంక్స్’’ అన్నారు.
వాళ్లు కూడా మనుషులే… బ్లడీ స్టుపిడ్ పోలీస్