తెలుగులో ప్రస్తుతం నితిన్ వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు. అయితే నితిన్ చేస్తున్న సినిమాలో రంగ్దే ఒక్కటి. ఇందులో నితిన్ కు కీర్తీ సురేష్ తో జంటగా నటిస్తుంది. అయితే ఈ సినిమా కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణను లాక్డౌన్ తరువాత కూడా ఎంతో ప్రణాళికా బద్దంగా పూర్తి చేశారు. ఈ సినిమా వెంకి దర్శకత్వం వహించాడు. దీనిని సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్పై నాగవంశీ నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు ఎంతగానో ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. అయితే ఈ సినిమా నుండి ఈ మధ్యే “బస్టాండే బస్టాండే… ఇక బతుకే బస్టాండే ” అంటూ వచ్చిన పాట ప్రేక్షకులను బాగా అలరించింది. అయితే ఈ సినిమా నుండి ఇప్పుడు మరో పాట వచ్చింది. ”నా కన్నులు ఎప్పుడు” అంటూ సాగుతున్న ఈ పాటను సూపర్ స్టార్ మహేష్ బాబు విడుదల చేసాడు. అయితే ఈ సినిమా హోళీ సందర్బంగా మార్చి 26న అభిమానుల ముందుకు రానుంది. దాంతో చిత్రబృందం ఇప్పుడు ప్రమోషన్స్లో బిజీ అయిపోయింది. అయితే అభిమానుల్లో ఈ సినిమాపై తారాస్థాయి అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా ఆ అంచనాలను అందుకుంటుందా… లేదా అనేది చూడాలి మరి.
previous post
next post
హామీలు అమలు చేయడంలో మోదీ విఫలం: ఉత్తమ్