దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో భారీ బడ్జెట్తో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవరస్టార్ రామ్చరణ్ కాంబినేషన్లో రూపొందుతున్న టాలీవుడ్ మోస్ట్ ప్రెస్టీయస్ ప్రాజెక్ట్ “ఆర్ఆర్ఆర్”. హై టెక్నికల్ వేల్యూస్ తెరకెక్కుతున్న చిత్రమిది. అలియా భట్, సముద్ర ఖని, అజయ్ దేవగణ్ కీలక పాత్రలలో కనిపించనున్నారు. ఈ చిత్రంలో ఎన్టీఆర్ కొమరం భీమ పాత్రలో, రామ్చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్నారు. డీవీవీ ఎంటర్టైన్మెంట్ బేనర్పై దానయ్య చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రెండు నిజ పాత్రల కల్పిత కథాంశమే ఈ చిత్రమని ఇది వరకే రాజమౌళి తెలియజేశారు. ఇటీవల చిత్ర షూటింగ్లో ఎన్టీఆర్ గాయపడడంతో కొద్ది రోజుల పాటు చిత్రీకరణకి బ్రేక్ ఇచ్చిన టీం రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటుంది. ఇందులో కథానాయికలుగా అలియా భట్, డైసీ ఎడ్గార్ జోన్స్ని ఎంచుకున్నాడు జక్కన్న. అయితే ‘‘కొన్ని అనివార్య కారణాల వల్ల డైసీ ఎడ్గర్ జోన్స్ ఈ చిత్రంలో చేయడం లేదు. ఆమెకు మంచి భవిష్యత్తు ఉండాలని కోరుకుంటున్నాము.. ’’ అంటూ ఆర్ఆర్ఆర్ టీమ్ కొద్ది రోజుల క్రితం తమ ట్విట్టర్ ద్వారా తెలిపింది. దీంతో ఎన్టీఆర్ సరసన ఎవరు నటిస్తారు అనే దానిపై పలు ఊహాగానాలు చెలరేగుతున్నాయి. తాజా సమాచారం ప్రకారం అమెరికన్ నటి ఎమ్మా రోబర్ట్స్ని ఎన్టీఆర్ సరసన కథానాయికగా ఎంపిక చేసినట్టు తెలుస్తుంది. దీనిపై అతి త్వరలోనే క్లారిటీ రానుంది. జూలై 30, 2020న చిత్రం విడుదల కానుంది.
previous post
next post