telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

బీజేపీ శ్రేణులపై అక్రమ కేసులు బనాయిస్తున్నారు: కన్నా

Kanna laxminarayana

ఏపీలో బీజేపీ శ్రేణులపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని బీజేపీ ఏపీ చీఫ్ కన్నా లక్ష్మీనారాయణ ఆరోపించారు.రాష్ట్ర బీజేపీ రాష్ట్ర విభాగం సమావేశం విజయవాడ సమీపంలోని పోరంకిలో నిర్వహించారు. స్థానిక పద్మావతి మ్యారేజి ఫంక్షన్ హాల్ లో జరిగిన ఈ సమావేషంలో కన్నా మాట్లాడుతూ డీజీపీని కలిసి ఫిర్యాదు చేసినా అక్రమ కేసులకు అడ్డుకట్టపడడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

రాష్ట్రంలో హిందూ ఆలయాలపై దాడులు జరుగుతున్నాయని, ఈ దాడులకు ప్రభుత్వం అండ ఉన్నట్టు భావిస్తున్నామని అన్నారు.ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు, మాజీ ఎంపీ పురందేశ్వరి, కంభంపాటి హరిబాబు, ఎమ్మెల్సీలు సోము వీర్రాజు, మాధవ్, మాజీమంత్రి మాణిక్యాలరావు, రావెల కిశోర్ బాబు తదితరులు పాల్గొన్నారు.

Related posts