telugu navyamedia
రాజకీయ వార్తలు సామాజిక

కోమాలోకి వెళ్లిన మాజీ సీఎం అజిత్ జోగి

Ajith jogi

చత్తీస్ గఢ్ మాజీ సీఎం అజిత్ జోగి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. ప్రస్తుతం ఆయన రాయ్ పూర్ లోని శ్రీ నారాయణ్ ఆసుపత్రిలో వెంటిలేటర్ పై ఉన్నారు. ఈ నెల 9న తీవ్ర అస్వస్థతకు గురికావడంతో కుటుంబ సభ్యులు ఆయనను ఆసుపత్రికి తరలించారు. ఆపై ఆయన పరిస్థితి విషమించడంతో కోమాలోకి వెళ్లిపోయారు. ఈ నేపథ్యంలో ఆయనకు ఇష్టమైన పాటలను ఇయర్ ఫోన్స్ ద్వారా వినిపిస్తున్నారు.

అజిత్ జోగి అస్వస్థకు ఓ చింతపిక్క కారణమని వైద్యులు చెబుతున్నారు. చింతపిక్క ఆయన శ్వాసనాళంలో ఇరుక్కుపోవడంతో ఆయన తీవ్ర అస్వస్థతకు గురయ్యారని వివరించారు. అజిత్ జోగి మెదడును క్రియాశీలకంగా మార్చేందుకు ఆడియో థెరపీ ఇస్తున్నామని శ్రీ నారాయణ్ ఆసుపత్రి మెడికల్ డైరెక్టర్ డాక్టర్ సునీల్ ఖేమ్కా వెల్లడించారు.

Related posts