దేశ రాజధాని ఢిల్లీలో జేఎన్యూ విద్యార్థులు రోడ్లపై ర్యాలీ చేపట్టారు. హాస్టల్ మెస్ చార్జీల పెంపును నిరసిస్తూ వాళ్లు ఆందోళనకు దిగారు. పార్లమెంట్ ముట్టడి కోసం ప్రయత్నించిన విద్యార్థులను ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. లాఠీచార్జ్ జరిగిందని విద్యార్థులు చేసిన ఆరోపణలపై విచారణ చేపట్టనున్నట్లు ఢిల్లీ పోలీసులు చెప్పారు.
ఈ నేపథ్యంలో ఇవాళ నాలుగు మెట్రో స్టేషన్లను మూసివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. ఉద్యోగ్ భవన్, పటేల్ చైక్, సెంట్రల్ సెక్రటేరియేట్ స్టేషన్ల వద్ద ఉన్న ఎంట్రీ, ఎగ్జిట్ గేట్లను మూసివేశారు. పోలీసులు ఇచ్చిన సలహా ప్రకారం మెట్రో రైళ్లను నాలుగు స్టేషన్ల వద్ద ఆపడం లేదని మెట్రో అధికారులు చెప్పారు.