telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

కొత్త రథం రూపకల్పనపై ప్రభుత్వానికి పవన్ విన్నపం

pawan

అంతర్వేదిలో లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో రథం దగ్ధమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కొత్త రథాన్ని నిర్మించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నాహకాలు చేస్తోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వానికి జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఓ విన్నపం చేశారు. రథం నిర్మించడంలో ఆలయ సంప్రదాయాలు పరిగణనలోకి తీసుకోవాలని చెప్పారు.

అంతర్వేది లక్ష్మీనరసింహస్వామిని అగ్నికుల క్షత్రియులు తమ కుల దైవంగా పూజిస్తుంటారని తెలిపారు. ఈ ఆలయాన్ని అగ్నికుల క్షత్రియులైన కొపనాతి కృష్ణమ్మగారు నిర్మించారనే విషయం అందరికీ తెలిసిందేనని అన్నారు.

తొలి రథాన్ని కూడా ఆమే రూపొందించారని చెప్పారు. శిథిలావస్థకు చేరిన ఆ రథం స్థానంలో స్థానిక అగ్నికుల క్షత్రియులు మరో రథాన్ని తయారు చేశారని అన్నారు. మొన్న దగ్ధమైన రథం అదేనని తెలిపారు.  కొత్త రథం రూపకల్పన కమిటీలో అగ్నికుల క్షత్రియులకు ప్రాతినిధ్యం లేకపోవడం బాధాకరమని అన్నారు.

Related posts