telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

విగ్రహాల ధ్వంసంపై నాని వ్యాఖ్యలు సరికావు: రఘురామకృష్ణరాజు

Raghuramakrishnaraju ycp mp

హిందూ దేవాలయాల్లోని విగ్రహాల ధ్వంసంపై ఏపీ మంత్రి కొడాలి నాని చేసిన వ్యాఖ్యలపై వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు మండిపడ్డారు. దేవాలయాల్లో విగ్రహాలను పగలగొట్టి ఇంకొకటి పెడతామని, రథం దగ్ధమైతే కొత్తది తయారు చేయిస్తామని చెప్పడం సరికాదని అన్నారు. మన ఇంట్లో పెట్టుకున్న దేవుళ్ల ఫోటోలపై ఎవరైనా ఉమ్మేస్తే, ఫొటోయే కదా అని ఊరుకుంటామా? అని ప్రశ్నించారు.

ఇదే విధంగా ఉంటే జనాలు తిరగబడి బుద్ధి చెప్పే రోజు వస్తుందని చెప్పారు. ప్రధాని మోదీ, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ లపై నాని వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం సరికాదని అన్నారు. వారిద్దరూ ఏమిటో కూడా తెలుసుకోకుండా మంత్రి నోటికొచ్చినట్టు మాట్లాడటం దారుణమని అన్నారు.

Related posts