telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు

బ్రేకింగ్ : CBSE 12వ తరగతి పరీక్షలు రద్దు

exam hall

కరోనా సెకండ్ వేవ్ నేపధ్యంలో విద్యార్ధుల పరిస్థితి గందరగోళంగా తయారైంది. రాష్ట్రాలకు సంబంధించి కొన్ని రాష్ట్రాలు ఇప్పటికే పరీక్షల రద్దు నిర్ణయం తీసుకున్నాయి. మరి కొన్ని రాష్ట్రాలు ప్రస్తుతానికి వాయిదా వేశాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సీబీఎస్ఈ 12వ తరగతి పరీక్షలను రద్దు చేసింది కేంద్రం. ప్రధాని మోడీ అధ్యక్షతన జరిగిన సమీక్షలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుత కరోనా పరిస్థితుల నేపథ్యంలో విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని సీబీఎస్ఈ 12వ తరగతి పరీక్షలను రద్దు చేయడానికే కేంద్రం మొగ్గు చూపించింది. ఇక ఈ ఫలితాల గురించి త్వరలోనే పూర్తి వివరాలు వెల్లడించనున్నారు. కాగా సీబీఎస్ఈ 10వ తరగతి పరీక్షలను రద్దు చేసిన సంగతి తెలిసిందే.

Related posts