తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రోజు రోజుకు రికార్డు స్థాయిలో కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. ఇప్పటికే రాష్ట్రంలో కరోనా కేసులు 2.91 లక్షలు దాటాయి కరోనా కేసులు. అయితే… ఇవాళ రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య కాస్త తగ్గింది. తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా కరోనా బులెటిన్ ప్రకారం..అయితే తాజా బులెటిన్ ప్రకారం గత 24 గంటల్లో 299 పాజిటివ్ కేసులు నమోదు కాగా ఇద్దరు మృతి చెందారు. ఇదే సమయంలో 379 మంది కోలుకున్నారు. దీంతో… పాజిటివ్ కేసుల సంఖ్య 2,91,666 కు చేరుకోగా… 2,85,898 మంది రికవరీ అయ్యారు. ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా 1577 మంది కరోనాతో మృతిచెందారు. ఇక, తెలంగాణలో కరోనా మృతుల శాతం 0.54 శాతంగా ఉంటే.. దేశవ్యాప్తంగా 1.4 శాతంగా ఉందని.. రాష్ట్రంలో రికవరీ రేటు 98.02 శాతంగా ఉంటే.. భారత్లో 96.6 శాతంగా ఉందని బులెటిన్లో పేర్కొంది సర్కార్. ప్రస్తుతం రాష్ట్రంలో 4,191 యాక్టివ్ కేసులు ఉండగా… వీరిలో 2,395 మంది హోం ఐసోలేషన్లో ఉన్నారు. ఇక, శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా 33,298 కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా… ఇప్పటి వరకు చేసిన కరోనా టెస్ట్ల సంఖ్య 74,61,687 కు చేరింది.
previous post