సుప్రీంకోర్టు జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి మధుకోడాకు షాక్ ఇచ్చింది. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసేందుకు అవకాశం కల్పించాలన్న ఆయన అభ్యర్థనను కోర్టు తిరస్కరించింది. ఎన్నికల వ్యయం వివరాలను సమర్పించలేదని ఎన్నికల సంఘం ఎన్నికల్లో పోటీ చేయకుండా మూడేళ్లపాటు మధుకోడాపై 2017లో నిషేధం విధించింది.
తనపై వేటు వేసి ఇప్పటికే రెండేళ్లయిందని, పోటీచేసేందుకు అవకాశమివ్వాలని మధుకోడా తరపు న్యాయవాది ఉన్నత న్యాయస్థానాన్ని కోరారు. ఇసి నిర్ణయంపై పిల్ దాఖలుకు అయిన ఆలస్యానికి మీరే కారణమని, ఎన్నికల్లో పోటీకి మరొక్క సంవత్సరం వేచి ఉండాల్సిందేనని జస్టిస్ ఎన్వి.రమణ, వి.రామసుబ్రహ్మణ్యన్లతో కూడిన ధర్మాసనం పేర్కొరది.