telugu navyamedia
రాజకీయ వార్తలు

పరిస్థితి మారకపోతే మరో వారం రోజులు!

narendra-modi

దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో లాక్ డౌన్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ లాక్ డౌన్ మరో వారం రోజుల పాటన్నా కొనసాగాలని, అప్పుడే వైరస్ తీవ్రత గణనీయంగా తగ్గుతుందని ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించినట్టు తెలుస్తోంది. ప్రజలంతా ఇళ్లలోనే ఉండటం, కంపెనీల మూసివేత, సమావేశాల రద్దు వంటివి నెలాఖరుతో ముగియబోవని తెలుస్తోంది. 31 తరువాత ఇంకో వారం రోజులైనా ఇదే పరిస్థితి ఉంటుందని ఆయన అన్నట్టు సమాచారం.

నిన్న లోక్ సభ నిరవధికంగా వాయిదా పడిన తరువాత స్పీకర్ చాంబర్ వైపు మోదీ రాగా, ఆయన్ను పలువురు పార్టీల ఎంపీలు కలిశారు.ఈ సందర్భంగా వారి మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది. లాక్ డౌన్ ఎంత కాలం కొనసాగే అవకాశాలున్నాయని ప్రధానిని ఎంపీలు ప్రశ్నించిన వేళ, మరో రెండు వారాలు ఉండవచ్చని, అప్పటికి అంతా సజావుగా మారుతుందనే భావిస్తున్నామని ప్రధాని వ్యాఖ్యానించారని తెలుస్తోంది.

Related posts