రెడ్మి సంస్థ త్వరలో కే30 5జీ స్మార్ట్ఫోన్ను భారత్ లో అందుబాటులోకి తెస్తామని పేర్కొంది. చైనా మార్కెట్లో డిసెంబర్ 10వ తేదీన రెడ్మి కే30 5జీ స్మార్ట్ఫోన్ను విడుదల చేయనున్నట్లు సంస్థ ప్రకటించింది. త్వరలో విడుదల కానున్న రెడ్మి కే- సిరీస్ ఫోన్స్ ఆండ్రాయిడ్ 10తో పని చేయనున్నాయి.
ఫోన్ ఫీచర్స్ : 4,500ఎంఏహెచ్ బ్యాటరీ, 27డబ్ల్యూ ఫాస్ట్ చార్జింగ్ సపోర్టు, 3.5 ఎంఎం హెడ్ఫోన్ జాక్, 6.66 అంగుళాల హెచ్డీ డిస్ప్లే, 6జీబీ ర్యామ్, 64జీబీ స్టోరేజ్, 64 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 13 మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్- యాంగిల్ షూటర్, 8 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్, 2 మెగాపిక్సెల్ కెమెరా ఉండే అవకాశం ఉంది.