telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

నిధుల దుర్వినియోగంపై విచారణ జరిపిస్తాం: మంత్రి శ్రీనివాస్

గత ప్రభుత్వ హయాంలో నిధుల దుర్వినియోగంపై విచారణ జరిపిస్తామని ఏపీ మంత్రి అన్నారు. విజయవాడ భవానీ ద్వీపాన్ని మంత్రులు అవంతి శ్రీనివాస్ సందర్శించారు. భవానీ ద్వీపం అభివృద్ధి, పర్యాటక ప్రాంతాల్లో మౌలికవసతుల కల్పనపై అధికారులతో మంత్రులు చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దుర్గమ్మకొండ, కృష్ణమ్మ పరవళ్లు, భవానీ ద్వీపం..ఇలాంటి ప్రదేశం ఎక్కడా ఉండదని పేర్కొన్నారు.

నేవీ టీంతో మాట్లాడి‌ కృష్ణా నదిలో వివిధ రకాల‌ వాటర్ స్పోర్ట్స్ నిర్వహిస్తామని చెప్పారు. అన్ని జిల్లాల్లో పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేస్తామని తెలిపారు. ఉమ్మడిరాష్ట్రంలో హైదరాబాద్‌ను అభివృద్ధి చేయడంతో ఎంతో పేరు గాంచిందన్నారు. అమరావతి, విజయవాడలను హైదరాబాద్‌ స్థాయిలో అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు.

Related posts