మొన్నటి ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక అన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఘోర పరాజయం పొందిన నేపథ్యంలో ఈ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు పార్టీ ముఖ్య నేతలతో కీలక సమావేశం నిర్వహించనున్నారు.
ఇందులో భాగంగా టీడీపీ తరపున గెలిచిన ఎమ్మెల్యేలు, సీనియర్ నాయకులతో ఆయన సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో శాసనసభాపక్ష పదవుల భర్తీపై చర్చ జరగనుంది. దీనితో పాటు ప్రభుత్వ వైఖరిపై ఎలా స్పందించాలనే దానిపై కూడా చర్చ జరిగే అవకాశముందని తెలుస్తోంది.